Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్థంతి సభలో నివాళులర్పించిన వక్తలు
నవతెలంగాణ-వికారాబాద్/సంగారెడ్డిటౌన్
బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన పుచ్చలపల్లి సుందరయ్య నేటి తరానికి ఆదర్శప్రాయుడని వక్తలు అన్నారు. సుందరయ్య 34వ వర్థంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కరాములు, జాన్వెస్లీ మాట్లాడారు. హైదరాబాద్ నగరంలోని దిల్సుఖ్నగర్లో, మేడ్చల్ జిల్లాలో సీపీఐ(ఎం), సీఐటీయూ, పార్టీ అనుబంధ యూనియన్ కార్యాలయాల్లో సుందరయ్య వర్ధంతి సభలు నిర్వహించి జెండావిష్కరణలు చేశారు. సంగారెడ్డి జిల్లాలో చుక్కరాములు మాట్లాడుతూ...
దేశంలో డబ్బు, మత రాజకీయాలు కొనసాగుతున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. మతోన్మాదం నుంచి దేశ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందన్నారు. వికారాబాద్లో జాన్వెస్లీ మాట్లాడుతూ.. చివరి శ్వాసవరకూ పేద ప్రజలకు అండగా నిలిచేందుకు సుందరయ్య పాటుపడ్డారని గుర్తుచేశారు. వ్యవసాయ కార్మిక సంఘం పెట్టి కూలి రేట్లు పెంచారన్నారు.