Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో ప్రతిపక్షాన్ని సహించలేని కేసీఆర్
- ఖమ్మం సెమినార్లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ-ఖమ్మంప్రతినిధి
గడిచిన ఐదేండ్ల కాలంలో దేశంలో మోడీ పరిపాలనా పుణ్యమా అని రాజ్యాంగ వ్యవస్ధలన్నీ నిర్వీర్యం అయ్యాయనీ, గతంలో ఎన్నడూ లేనివిధంగా మహిళలపై లైంగిక దాడులు, మతోన్మాద దాడులు, దళితులు, మైనార్టీలపై అన్ని రకాల దాడులు జరుగుతున్నాయనీ సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య విమర్శించారు. మోడీ పరిస్ధితి అలా ఉంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారనీ, ప్రశ్నించే విధానాన్ని ఓర్చులేకపోతున్నారని ఆయన విమర్శించారు. మార్క్సిస్ట్ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 34వ వర్ధంతి సందర్భంగా 'ప్రజాస్వామ్య పరిరక్షణ-ప్రజల కర్తవ్యం' అంశంపై జరిగిన సెమినార్లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్ధలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కాగ్, సీబీఐ, విజిలెన్స్ కమిషన్, ఆర్బీఐ, ఎన్నికల కమిషన్ తదితర రాజ్యాంగ వ్యవస్ధలన్నీ నిర్వీర్యం అయ్యాయన్నారు. ప్రస్తుతం దేశంలో ఏ ఒక్క వ్యవస్ధ మోడీకి వ్యతిరేకంగా పని చేసే పరిస్ధితుల్లో లేదన్నారు. స్వయంప్రతిపత్తి కలిగిన ఈ సంస్ధలన్నీ మోడీ, ఆయన ఆనుయాయుల చేతుల్లో నలిగిపోతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రతిపక్షాన్ని బతకనిచ్చే పరిస్ధితి లేకుండా చేస్తున్నారన్నారు. ప్రశ్నించే తత్వాన్ని సహించే పరిస్ధితిలో కేసీఆర్ లేడన్నారు. కార్మికులకు కనీస వేతనాలు 73 రంగాల్లో అమలు చేయాలనీ, ఫైల్స్ పెండింగ్లో ఉండగా ఒక్క రంగానికి సంబంధించిన ఫైల్ కూడా ముందుకు కదిలే పరిస్ధితి లేదన్నారు. కౌలు రైతులను తాను రైతులుగా గుర్తించడం లేదని స్వయంగా కేసీఆర్ చెప్పడాన్ని బట్టి ఆయనకు అన్నదాతలపై ఉన్న ప్రేమ గుర్తించవచ్చన్నారు.