Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుట్టుచప్పుడు కాకుండా వివరాల సేకరణ
- ఆస్తిపన్ను చెల్లిస్తున్న వారికీ తొలగింపు
- రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఫైనల్ జాబితా
నవతెలంగాణ-సిటీబ్యూరో
పెంచిన పింఛన్ మొత్తాన్ని ఎన్నికల కోడ్ నేపథ్యంలో అమలు చేయలేకపోతున్నామని చెప్పిన సర్కారు.. ఉన్న పింఛన్ను కోత పెట్టి లబ్దిదారులను తగ్గించేందుకు యత్నిస్తున్నది. ఇప్పటికే గ్రేటర్లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన మండలాల్లో గుట్టుచప్పుడు కాకుండా సర్వే చేస్తున్నారు. ఈ నివేదిక అందిన తర్వాత ఫైనల్ జాబితాను రూపొందించి పెంచిన పింఛన్ను ఇచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. విశేషమేమంటే.. ఆస్తిపన్ను చెల్లిస్తున్న వారికీ పింఛన్ కోత పెట్టునున్నట్టు సమాచారం.
గ్రేటర్ పరిధిలో ఆసరా ఫించన్ లబ్దిదారులను తగ్గించేందుకు జీహెచ్ఎంసీ సర్కిల్ స్థాయిలోని బిల్కలెక్టర్ల ద్వారా సర్వే చేయిస్తోంది. హైదరాబాద్ జిల్లాలో పోలింగ్ కేంద్రాలు, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో సర్కిళ్ల వారీగా సర్వే చేయిస్తున్నారు. పింఛన్లకు సంబంధించిన వివరాలను రెవెన్యూ శాఖ అధికారుల నుంచి జీహెచ్ఎంసీలోని పట్టణ సామాజిక విభాగం (యూసీడీ)లోని సర్కిల్ స్థాయీ డిప్యూటీ ప్రాజెక్టు ఆఫీసర్(డీపీఓ)కు అందజేశారు. డీపీఓల నుంచి బిల్ కలెక్టర్లకు అందజేశారు. ఆస్తిపన్ను వసూళ్లలో కీలకంగా ఉన్న బిల్ కలెక్టర్లు ఆస్తిపన్ను చెల్లించే జాబితా ఆధారంగా ఏరివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఎవరైతే ఆస్తిపన్ను చెల్లిస్తున్నారో (అంటే సొంత ఇల్లు ఉన్నవారు) వాళ్లకు సంబంధించి ఏ ఒక్కరికీ ఆసరా ఫించన్ రాకుండా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్నా, ఇంట్లో మోటార్ సైకిల్ ఉన్నా ఆ ఇంట్లో ఎవరికీ ఆసరా పింఛన్ వర్తించదు. ముఖ్యంగా ముషీరాబాద్, అంబర్పేట్ సర్కిళ్లలో సర్వేను వేగవంతంగా పూర్తిచేశారు. జీహెచ్ఎంసీ చేసిన సర్వే నివేదికను రెవెన్యూ శాఖలకు అందజేయనున్నారు. ఆ నివేదికను పరిశీలించాక రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో తుది జాబితాను సిద్ధం చేయనున్నట్టు బల్దియా అధికారుల ద్వారా తెలిసింది.
ఇదీ లెక్క...
జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లా లోని మండలాల్లో అన్ని రకాల పింఛన్ లబ్దిదారులు సుమారు మూడు లక్షల మంది ఉంటారని అధికారుల అంచనా. హైద రాబాద్ జిల్లాలోని 16 మండలాల పరిధిలో మొత్తం మొత్తం 1.52 లక్షల ఆసరా పింఛన్లు ఉన్నాయి. వాటిలో 51 వేలా 415 వృద్ధాప్య పింఛ న్లు, 77 వేలా 351 మంది వితంతు, 23 వేలా 272 విక లాంగ పింఛన్లు ఉన్నా యి. మేడ్చల్ జిల్లాలో పట్టణ ప్రాంతా ల్లో(జీహెచ్ ఎంసీ సర్కిళ్లు) 73,137, రంగారెడ్డి లోని పట్టణ ప్రాంతాలకు చెందిన ఐదు మండలాల్లో 30 వేలకుపైగా లబ్దిదారులు ఉంట ారని అంచన. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరువు- రామచంద్ర పురం సర్కిల్లో ఐదు వేలకుపైగా ఉంటారని అంచనా. వృద్ధులు, వితంతువులకు రూ.1000 ఉన్న దాన్ని రూ.2,016, వికలాంగులకు రూ.1500 నుంచి రూ.3,016 వరకు ప్రభుత్వం పెంచింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అమలు వాయిదా పడుతూ వస్తున్నది.