Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఐఏఎస్లుగా పదోన్నతి పొందిన రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారులకు క్యాడర్ను నిర్దారిస్తూ డీవోపీటీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ అధికారులు కే.స్వర్ణలత, ఎమ్.హరితలను 2017 క్యాడర్గా నిర్దారించారు. ఎమ్.సత్య శారదాదేవీ, నారాయణరెడ్డి, ఎస్.హరీశ్, జి.రవి, కే.నిఖిల, ఆయిషా మస్రద్ ఖనమ్, కే.స్నేహ, ఎస్.సంగీతా సత్యనారాయణ, ఎస్కే యస్మీన్ బాషా, ఎస్.వెంకటరావులను 2018 క్యాడర్గా నిర్దారించారు.