Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-రంగారెడ్డిప్రతినిధి
నవతెలంగాణ-రంగారెడ్డిప్రతినిధి
కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర సోమవారం రెండో రోజుకు చేరింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని దన్నారం, పులిమామిడి, బాచుపల్లి, కందుకూర్ మండలంలోని నెదునురు, గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్నా.. తక్షణమే మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి సొమ్ముతో సీఎం కేసీఆర్ శాసనసభ్యులను కొంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారడం అవమానకరమన్నారు. తప్పనిసరిగా సబితారెడ్డి శాసనసభ సభ్యత్వానికి రద్దు చేయిస్తామని తిరిగి మహేశ్వరంలో మధ్యంతర ఎన్నికలను జరిగే పరిస్థితిని తీసుకొస్తామని తెలిపారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసే వరకు ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర కొనసాగుతుందన్నారు.