Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధారి
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో సోమవారం జరిగింది. ఎస్ఐ సత్యనారాయణ వివరాల ప్రకారం.. మండలంలోని సర్వాపూర్ గ్రామానికి చెందిన మండా బాలయ్య(55) తన రెండెకరాల పొలంలో అప్పు చేసి మక్క సాగుచేశాడు. దిగుబడి సరిగా రాకపోవడంతో తీవ్ర ఆవేదన చెందాడు. బాలయ్యకు ముగ్గురు కూతుర్లున్నారు. 3లక్షల వరకూ అప్పులు చేసి వారి పెండ్లిళ్లు చేశాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. వాటిని ఎలా తీర్చాలని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు. మృతుని అల్లుడు బాలరాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.