Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి, కల్లూరు మండలం చిన కోరుకోండి గ్రామాల ఉపాధి కూలీలకు కాలం చెల్లిన మందులు, ప్రథమ చికిత్స కిట్లను సప్లరు చేసిన సంస్థను తక్షణం బ్యాన్ చే యాలని, అందుకు బాధ్యులైన అధికారులను సస్పె ండ్ చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ ం(జవహర్నగర్) రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు రాష్ట్ర ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. ఎర్రటెండలో వడగా ల్పులను లెక్కచేయకుండా చేతులు బొబ్బలెత్తుతున్నా మహిళా కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారని, పొట్టకూటి కోసం పనికొస్తున్న కూలీలను కమీషన్లకు కక్కుర్తి పడి చదువు లేని అమాయక కూలీలకు కాలం చెల్లిన మందులు ఇచ్చి చంపేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందేమో అన్న అనుమానం కలుగుతుదన్నారు.