Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను వెబ్సైట్లో పెట్టాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్ని నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు జారీకి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ నిరాకరించింది. తుది ఓటర్ల జాబితాను వెల్లడించకుండానే వరంగల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ లింగుస్వామి ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యాలను బెంచ్ బుధవారం విచారించింది. ఓటర్ల జాబితా ప్రకటించకుండా ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించారని, ఇది రాజ్యాంగ నిబంధనలను ఉల్లఘించడమేనని పిటిషనర్ లాయర్ వాదించారు. ఓటర్ల జాబితా సిద్ధంగా ఉందని, ప్రచురిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తరఫు లాయర్ అవినాష్ బదులిచ్చారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక కోర్టులు జోక్యం చేసుకునేందుకు వీల్లేదని పేర్కొన్నారు.