Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్, బీఎస్సీ మ్యాథమెటిక్స్ కోర్సుల్లో ద్వితీయ సం వత్సరంలో 2019-20 ప్రవేశాలకు నిర్వహించిన ఇంజినీరింగ్ కామన్ ఎ ంట్రెన్స్ టెస్ట్ (ఈసెట్)-2019 ఆన్లైన్ రాతపరీక్ష ఫలితాలను ఉన్నత విద్యా మ ండలి చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డి బుధవారం విడుదల చేశారు. ఈసెట్కు 28,037 మంది దరఖాస్తు చేయగా, 27,123 మంది రాతపరీక్ష రాశారు. వారిలో 24,497 (90.32 శాతం) మంది అర్హత పొందారు. అబ్బాయిలు 20,174 మ ంది దర ఖాస్తు చేస్తే, 19,481 మంది రాతపరీక్షకు హాజరయ్యారు. వారిలో 17,437 (89.51 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 7,863 మంది అమ్మాయిలు దరఖాస్తు చేస్తే, 7,642 మంది పరీక్ష రాశారు. వారిలో 7,060 (92.38 శాతం) మంది ఉతీ ్తర్ణత పొందారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు 2.87 శాతం మంది అధికంగా అర్హత సాధించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ హైదరాబాద్ వీసీ ఎ వేణు గోపాల్రెడ్డి, రిజిస్ట్రార్ ఎన్ యాదయ్య, ఈసెట్ కన్వీనర్ ఎ గోవర్ధన్ పాల్గొన్నారు.