Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీవీ9 మాజీ సీఈవో వి రవిప్రకాశ్కు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రవిప్రకాశ్ దాఖలు చేసుకున్న మూడు వేరు వేరు వ్యాజ్యాలను బుధవారం హైకోర్టు కొట్టివేసింది. పోలీసులు నమోదు చేసిన కేసుల్లో విచారణకు హాజరు కావాలనీ, విచారణకు పూర్తిగా సహకరించాలని రవిప్రకాష్ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ రాజశేఖర్రెడ్డి ఆదేశించారు. అదేవిధంగా పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 41ఎ ప్రకారం చర్యలు తీసుకోవచ్చునని స్పష్టం చేశారు. కంపెనీలా ట్రిబ్యునల్లో వివాదం ఉండగా తనపై అన్యాయంగా మూడు కేసులు పెట్టారని, బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసేందుకు వస్తే రవిప్రకాశ్ పారిపోవాల్సి వచ్చిందని ఆయన తరఫు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ దల్జీత్సింగ్ అహ్లువాలియా వాదించారు. వాదనల అనంతరం రవిప్రకాశ్ దాఖలు చేసుకున్న ముందుస్తు బెయిల్ అభ్యర్థన వ్యాజ్యాలను తోసిపుచ్చుతున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.