Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు విడుదలైన ఎగ్జిట్ పోల్స్ను నమ్మొద్దని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఫలితాలకు రెండు రోజుల ముందు ఉత్తర ప్రదేశ్లో ఈవీఎంలను తరలిస్తున్నారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో కార్యకర్తలందరూ ఈవీఎం లు భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద అప్రమ త్తంగా ఉండాలని సూచించారు. 'జాగ్రత్తగా ఉండండి. తర్వాత వచ్చే 24 గంటలు చాలా కీలకం. మీరు సత్యం కోసం పోరాడుతున్నారు. నకిలీ ఎగ్జిట్ పోల్స్ను నమ్మకండి. మీపై మీరు నమ్మకం ఉంచండి. మీ కష్టం వృథా కాదు' అంటూ ట్వీట్ చేశారు.