Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీడీసీఎల్ సీఎమ్డీ రఘుమారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో జూన్ ఒకటి నుంచి ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను వినియోగించబోతున్నామని ఎస్పీడీసీఎల్ సీఎమ్డీ రఘుమారెడ్డి వెల్లడించారు. దేశం మొత్తం మీద ప్రీపెయిడ్ మీటర్లు వాడుతున్న తొలి రాష్ట్రం తెలంగాణాయేనని తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. ఈపద్ధతిలో ఇప్ప టికే 11 వేల ప్రీపెయిడ్ మీటర్లను బిగించామని, మరో రెండు వేల మీట ర్లు బిగించేందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. స్మార్ట్ మీటర్ల పేరు తో కొన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చినా ఆ పద్ధతిని అమలు చెయడంలో అవి విఫలమయ్యాయని తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని విభాగాల్లో నూప్రీపెయిడ్ మీటర్లను అమర్చుతామని చెప్పారు. ప్రతీ యేటా తెలం గాణలో రెండు లక్షల కొత్త కనెక్షన్లను ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో 68కొత్త సబ్స్టేషన్లను నిర్మించా మని వివరించారు. గత ఐదేండ్లలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 30మెగావాట్ల నుంచి మూడువేల మెగావాట్లకు పెంచామని, ఫలితంగా యేటా రూ.52 కోట్లు ఆదా అవుతున్నాయని సీఎమ్డీ వివరించారు.