Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపోల్
వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం చిన్నమాసాన్పల్లి గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సొక్కం నర్సయ్య(58) రోజులాగే ఉపాధి పనులకు ఉదయాన్నే వెళ్లాడు. సింగం చెరువులో పని చేస్తుండగా ఉన్నట్టుండి కుప్పకూలి పోయాడు. గమనిం చిన కూలిలు చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య బుచ్చమ్మ, కుమారులు మల్లేశం, స్వామి ఉన్నారు. ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలిలకు సరైన వసతులు కల్పించకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కూలిలు ఆరోపిస్తున్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.