Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మండుటెండల్లో ఉపాధి కూలీలు పడుతున్న బాధలు వర్ణాతీతమని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం(అమృతా ఎస్టేట్స్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కలకొండ కాంతయ్య, టి.వెంకట్రాములు బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలు పనిచేసే ప్రదేశాల్లో ఎక్కడ కూడా నీడ సౌకర్యం ఉండటం లేదని, తాగునీటి సౌకర్యాన్ని కల్పించడం లేదని తెలిపారు. ఎక్కడ కూడా మెడికల్ కిట్స్ అందుబాటులో ఉండటం లేదని పేర్కొన్నారు. నారాయణపేట జిల్లాలో 10 మంది ఉపాధి కూలీలు చనిపోయినా, వడదెబ్బతో మరణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మట్టిదిబ్బ కూలి చనిపోయిన 10 మంది ఉపాధి కూలీలకు చెందిన ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని, పనిచేసిన 15 రోజుల్లోగా వేతనాలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.