Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిటిషనర్ల వాదన
న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందం కేసులో కేంద్రం నమ్మకంగా, ఉద్దేశపూర్వకంగానే సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించిందని పిటిషనర్లు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అసత్యాలను వెల్లడిస్తూ కోర్టును 'హోల్సేల్గా మోసపుచ్చిం దని మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్శౌరి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ 41 పేజీల లిఖిత పూర్వక పిటిషన్లో పేర్కొన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొను గోలులో వాస్తవాలను కప్పిపుచ్చేందుకు యత్నించిన అధికా రులపై కూడా చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలును సమ ర్థిస్తూ డిసెంబర్ 14న అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులోని అంశాలను లేవనెత్తుతూ తాజాగా ఈ పిటిషన్ ను దాఖలు చేశారు.
36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్తో డస్సాల్ట్ ఏవియేషన్ చేసుకున్న ఒప్పందానికి సంబంధించి అసలైన రికార్డులను కోర్టులో సమర్పించడానికి బదులుగా సీల్డ్ కవర్లలో దాఖలు చేసిన రెండు డాక్యుమెంట్లతో ప్రభుత్వం సుప్రీం కోర్టును మోసగించిందని పిటిషనర్లు పేర్కొన్నారు. నిజాలను దాచిపెట్టడం ద్వారా అబద్ధాలను ప్రోత్సహించిందని, కోర్టు పరిశీలనలో ఉన్న అంశంపై ప్రత్యక్ష, విస్తృతమైన వాస్తవమైన అంశాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదని విడతల వారీగా, ఒక పద్ధతిలో ఈ నకిలీ డాక్యుమెంట్లను కోర్టులో దాఖలు చేసినట్లు తెలిపారు. కోర్టు ప్రభుత్వాన్ని విశ్వసించిందని, దీంతో ప్రభుత్వం సమర్పించిన డాక్యుమెంట్లపై ఆధారపడిందని, అయితే ప్రభుత్వం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయిందని పిటిషనర్లు వాదించారు. అబద్దాలు, మోసపూరితమైన డాక్యుమెంట్ల ఆధారంగా కోర్టు డిసెంబర్ 14న తీర్పును ఇచ్చిందని, ఈ తీర్పులో వాస్తవికత లేదని అన్నారు. ప్రభుత్వం సమర్పించిన నివేదికలు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2012 నుండి రిలయన్స్ కంపెనీకి, డస్సాల్ట్కు మధ్య సంబంధాలు ఉన్నాయని, ఇది పత్రికా ప్రకటన ద్వారా కూడా వెల్లడైందని సూచించాయి. అయితే ఇది అవాస్తవమని పిటిషనర్లు వాదిస్తున్నారు.
రిలయన్స్ కంపెనీ డస్సాల్ట్తో ఒప్పందం చేసుకున్న అనంతరం 2014లో రక్షణ రంగంలోకి ప్రవేశించిందని పేర్కొన్నారు. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ ఇండిస్టీస్ అని కేంద్రం ఉద్దేశపూర్వకంగా పేర్కొందని, దీంతో కోర్టును తప్పుదారి పట్టించిందని అన్నారు. అదేవిధంగా ప్రధాన మంత్రి కార్యాలయం ఫ్రాన్స్తో సమాంతరంగా చర్చలు జరపడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. సిబిఐ విచారణ జరిపినా ఇప్పటివరకూ ఫిర్యాదు ఎందుకు నమోదు చేయలేదని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.