Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మహిళా కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లులక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధ వారం రాష్ట్ర కమిటి సమావేశం ఐద్వా కార్యాలయంలో బత్తుల హైమావతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలపై జరిగే హింస, లైంగిక వేధింపులు, మహిళల గోడును వినిపించటానికి మహిళా కమిషనర్ను నియమించకపోవటం శోచనీయ మన్నారు. 'సమాజంలో సగ భాగం ఉన్న మహిళల ఓట్లు కావాలి గానీ, క్యాబినెట్ లో మహిళలకు స్థానం లేదు. దీనిని బట్టి చూస్తే మహిళల పట్ల ముఖ్యమంత్రి కేసిఆర్ వైఖరి చిన్నచూపు, వివక్ష స్పష్టంగా కనబడుతున్నదని విమర్శించారు. కనీసం స్త్రీ, శిశు సంక్షేమశాఖకు మంత్రిగా మహిళను నియమించాలిగానీ.. పురుషుడికి ఆ పదవి కట్టబెట్టడమేమిటని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అనేక ఘటనలు జరుగుతున్నాయన్నారు. యాదగిరిగుట్టలో సెక్స్రాకెట్, సిద్దిపేటలో దళిత అమ్మాయిపై సామూహిక అత్యాచారం, హజీపూర్లో ముగ్గురు అమ్మాయిలపై అత్యాచారం..హత్య ఘటనలపై ప్రభుత్వం స్పందించకపోవడం దారణమన్నారు. ఈ ఘటనలపై మాట్లాడటానికి ముఖ్యమంత్రి సమయం కేటాయించడంలేదని విమర్శించారు. మహిళలకు, అమ్మాయిలకు భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి.జ్యోతి, కె.ఎన్.ఆశలత, ఆఫీస్బేరర్స్ ఆరుణజ్యోతి, వినోద, లక్ష్మమ్మ, ప్రభావతి, భారతితోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.