Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3 కోట్ల ఆస్తినష్టం జరిగిందని అంచనా
నవతెలంగాణ - షాబాద్
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం లోని చందన్వెళ్లిలో ఉన్న ప్లాస్టిక్ కంపెనీలో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు కార్మికులె వరూ లేకపోవడంతో ప్రాణనష్టమేమీ జరుగ లేదు. షాబాద్ పోలీసులు, కంపెనీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. చందనవెళ్లి శివారులో ఉన్న మైప్లా నెట్ ఐగ్రూప్లో ప్లాస్టిక్ వస్తువులు, పైపుల ఉత్పత్తి జరుగుతోంది. అయితే, మంగళవారం అర్ధరాత్రి కంపెనీ నుంచి అకస్మాత్తుగా మంటలు లేచాయి. స్థాని కులు గమనించి పరిశ్రమ యాజమా న్యానికి, పోలీసులకు తెలిపారు. వెంటనే వారు అగ్నిమాకపదళానికి సమాచారం అందించడంతో చేవెళ్ల నుంచి అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం 8గంటల వరకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. చేవెళ్ల సీఐ గురువయ్యగౌడ్ చేరుకుని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. యంత్రాలు, ముడిసరుకులు ఈ ప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్లాస్టిక్ రసాయ నాల కారణంగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. కంపెనీ షెడ్డు పూర్తిగా నేలమట్టమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.3కోట్ల ఆస్తినష్టం జరిగినట్టు యాజమాన్యం తెలిపింది.