Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడ్రోజులు ఇంట్లో బంధించి అఘాయిత్యం
- నిందితుడి అరెస్ట్
నవతెలంగాణ- మిర్యాలగూడ
దళిత బాలికను కిడ్నాప్ చేసి మూడ్రోజులు ఇంట్లో బంధించి యువకుడు లైంగిక దాడి చేశాడు. ఈఘటన మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో వెలుగులోకొ చ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపూజీనగర్కు చెందిన దళిత బాలిక ఇటీవల పదో తరగతి పూర్తి చేసింది. ఈనెల 9న మధ్యాహ్నం సమయంలో కిరాణ షాపునకు వెళ్లిన బాలిక అదృశ్యమైంది. అదే వీధిలో ఉంటున్న పిన్నపురెడ్డి నితిన్రెడ్డి నోట్లో గుడ్డలుపెట్టి బలవంతంగా తన ఇంట్లోకి తీసుకెళ్లి బాలికను నిర్బంధించాడు. సాయంత్రం వరకూ బాలిక ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల, బంధువుల ఇండ్లల్లో వెతికారు. అప్పటికీ కన్పించకపోవడంతో సోమవారం స్థానిక కౌన్సిలర్ ఆంజనేయరాజు సహకారంతో మరోమారు వెతికారు. అదే వీధిలో నివాసముంటున్న నితిన్రెడ్డిపై అనుమానం వచ్చి పలుమార్లు ప్రశ్నించారు. తనకు తెలియదంటూ బుకాయించడంతో వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సోమవారం రాత్రి నితిన్రెడ్డి ఇంటికెళ్లి ప్రశ్నించారు. అయినప్పటికీ బాలిక విషయం తనకు తెలియదని బుకాయించాడు. మంగళవారం ఉదయం బాధిత బాలిక ఆ ఇంట్లో తప్పించుకుని తల్లిదండ్రుల వద్దకు చేరింది. మూడ్రోజులుగా తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. ఆదివారం మధ్యాహ్నం తనను నోట్లో గుడ్డలు పెట్టి కిడ్నాప్ చేశారని, ఇంట్లో బంధించి మూడ్రోజుల పాటు నితిన్రెడ్డి తనపై లైంగిక దాడి చేసినట్టు పోలీసులకు వివరించింది. పోలీసులు వెంటనే నితిన్రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నితిన్రెడ్డిపై 376 సెక్షన్ 5 రెడ్విత్ 6, పోక్సో యాక్ట్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రజినికర్ తెలిపారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
బాలికకు న్యాయం చేయాలి : దళిత సంఘాలు
బాధిత బాలికకు న్యాయం చేయాలని దళిత సంఘాల నాయకులు ముండ్లగిరి కాంతయ్య, మొండికత్తి లింగయ్య, ఎడ్ల రమేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం పోలీస్స్టే షన్లో బాధిత బాలికను పరామర్శించారు. కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. బాలికను కిడ్నాప్ చేసి ఇంట్లోనే బంధించి అఘాయి త్యానికి పాల్పడుతున్నా నితిన్రెడ్డి తల్లిదండ్రులు పట్టించుకో కపోవడం ఏంటని ప్రశ్నించారు. చట్టపరమైన చర్యలు తీసు కొని బాలికకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.