Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి
నవతెలంగాణ - కరీంనగర్ టౌన్
ఎంపికైన టీఆర్టీ అభ్యర్థులకు వెంటనే నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అథిథి గృహంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 21 అక్టోబర్ 2017న 8,792 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. 28 ఫిబ్రవరి 2018లో పరీక్ష నిర్వహించారని, 7,414మంది అభ్యర్థులను ఎంపిక చేశారని చెప్పారు. 1378 పోస్టుల పీఈటీ, ఎస్ఏ, ఎల్పీ (హిందీ) ఫలితాలు ప్రకటించలేదన్నారు. రెండేండ్లు కావొస్తున్నా ఎంపికైన వారికి ఇప్పటి వరకు నియామకాలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి బాధ చెప్పుకునేందుకు ప్రగతి భవన్కు వెళ్లితే పోలీసుల దాడి చేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. పక్క రాష్ట్రంలో ఈ ఐదేండ్లలో రెండు డీఎస్సీలు నిర్వహించి మూడో డీఎస్సీకి రెడీ అయ్యారని తెలిపారు. ఇక్కడ మాత్రం రాష్ట్ర పభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. పేద విద్యార్థులకు కేజీ టూ పీజీ నిర్బంధ విద్య అమలు చేస్తామని చెప్పిన కేసీఆర్ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. విద్యార్థులు తక్కువ ఉన్నారనే నెపంతో పాఠశాలలు మూసేయడం తగదన్నారు.