Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- విలేకరులు
వడదెబ్బతో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు మృతిచెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గోపాలపురం గ్రామానికి చెందిన దొనికెల వీరమ్మ(80) ఎండకు తట్టుకోలేక చనిపోయాడు. నల్లగొండ జిల్లా తిరుమలగిరిసాగర్ మండల కేంద్రానికి చెందిన మునగాల కమలమ్మ(70), కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన మామిడాల భూదేవి(90) వడదెబ్బతో మృతిచెందారు. కామా రెడ్డి జిల్లా గాంధారి మండలం దుర్గం గ్రామపంచాయతీ పరిధి లోని కొత్తాబాది తండాకు చెందిన బానోత్ మారుబాయి(41) నాలుగు రోజులు ఎండలో వ్యవసాయ పనులు చేసింది. దాంతో అస్వస్థతకు గురై చనిపోయింది.