Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాళేశ్వరానికి ప్రధానిని పిలుద్దామనుకుని..
- వెనక్కి తగ్గిన కేసీఆర్
- రాజకీయ అంశాలే కారణం
- కేంద్రానికి, రాష్ట్రానికి ఉండాల్సిన సంబంధాలుంటాయంటూ చెప్పిన కేటీఆర్
- తాజా పరిస్థితితో నిర్ణయం మార్చుకున్న వైనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్రమోడీ మధ్య వ్యవహారం బెడిసికొట్టిందా?. రెండోసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టినప్పుడు ఆ కార్యక్రమానికి వెళ్లాలనుకున్న కేసీఆర్ ఎందుకనో ఆగిపోయారు. ప్రత్యేకంగా ప్రధానిని కలిసి అభినందనలు చెప్పాలనుకున్నా వాయిదా వేసుకున్నారు. ప్రధాని ఆధ్వర్యంలో ఈ నెల 15న జరిగే నిటి అయోగ్ సమావేశానికి వెళ్లడం లేదు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించాలని అనుకుని చివరిక్షణంలో రద్దు చేసుకున్నారు. గతంలో మోడీని ఆకాశానికేత్తేసిన కేసీఆర్ ఒక్కసారిగా తన నిర్ణయాన్ని మార్చుకోవడం వెనుక రాజకీయ కారణాలేంటన్నది ప్రశ్నగా మిగిలింది.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేర్కొంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తొలుత ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. దీనిని ప్రభుత్వ వర్గాలు ధ్రువికారించాయి.కానీ తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఏపీ, మహారాష్ట్ర సీఎంలు జగన్, ఫడ్నవీస్లు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. మొన్నటి లోక్సభ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ... ఎన్నికల్లో గెలుపోటములనేవి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల మీద ఎలాంటి ప్రభావమూ చూపబోవని అన్నారు. అందువల్ల మోడీ సర్కారుతో గతంలో మాదిరి గానే ఇప్పుడు కూడా చట్టబద్ధంగా ఉండే అన్ని సంబంధాలనూ నెరుపు తామని స్పష్టం చేశారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాత్రం ఈ సంబంధాన్ని నెరపలేకపోగా... అంతకు మందు ఉన్న సంబంధం కూడా బెడిసెకొట్టే అవకాశాలు కనబడుతుండటం గమనార్హం.
వాస్తవానికి ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావుడి చేసిన కేసీఆర్.. ఫలితాల తర్వాత మిన్నకుండిపోయారు. ఇదే సమ యంలో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకుంది. అత్యంత ప్రతిష్టా త్మకంగా భావించిన నిజామాబాద్ స్థానంలో తన కుమార్తె కవిత ఓడిపో తుందని కేసీఆర్ అస్సలు ఊహించలేదు. ఇదే సమయంలో కరీంనగర్లో సీనియర్ ఎంపీ వినోద్కుమార్ ఓటమి కూడా టీఆర్ఎస్ను కలవరానికి గురి చేసింది. మరోవైపు సికింద్రాబాద్ నుంచి గెలిచిన కిషన్రెడ్డిని.. మోడీ హోంశాఖ సహాయ మంత్రిని చేశారు. తద్వారా తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో పట్టు పెంచుకోవచ్చన్నది బీజేపీ వ్యూహం. దీంతోపాటు జీహెచ్ఎమ్సీ ఎన్నికలే తమ లక్ష్యమంటూ ఇక్కడి కమలం పార్టీ నేతలు ప్రకటించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఒకడుగు ముందుకేసి టార్గెట్ 2023 అంటూ పదేపదే చెబుతున్నారు. తద్వారా తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తామంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎంపీల్లో ఒక ఇద్దర్ని బీజేపీ తనవైపునకు లాక్కోబోతున్నదనీ, తద్వారా రాష్ట్రంలో మరిం త బలోపేతం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నదనే వాదనలూ వినబడుతు న్నాయి. అలాగే టీఆర్ఎస్లో అంతర్గత సంక్షోభం త్వరలోనే మొదలవబో తుందంటూ కమలం పార్టీ నేతలు కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిణామాలు టీఆర్ఎస్ అధినేతకు ఇబ్బందికరంగా మారాయి. ఈ కలవరపాటు వల్లే బీజేపీతోనూ, ఆ పార్టీ నాయకులతోనూ సంబంధాలు నెరపొద్దనే సంకేతాలను ఆయన గులాబీ శ్రేణులకు ఇవ్వదలిచారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తొలుత ప్రధానిని ఆహ్వానించాలని భావించినా.. ఆ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్తో కేసీఆర్ సమావేశం
- కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి
రావాల్సిందిగా ఆహ్వానం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ముంబయిలో మహారాష్ట్ర సీఎం దేవేద్ర ఫడణవీస్తో సమావేశమయ్యారు. ఈ నెల 21 న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారం భోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరు కావా ల్సిందిగా ఫడణవీస్ను కేసీఆర్ ఆహ్వా నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజి వద్ద నిర్మించిన కన్నెపల్లి పంప్హౌస్ వద్ద ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేడుక జరగనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అంతరాష్ట్ర వివాదాలను పరిష్కరించుకోవటంలో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రితో 2016 లో కేసీఆర్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో 100 మీటర్ల ఎత్తుతో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించింది. ఈ నేపధ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ను ప్రాజెక్టు ప్రారం భోత్సవానికి ఆహ్వానించాలని ఇటీవల కేసీఆర్ నిర్ణయించారు. శుక్రవారం ఇరు వురి మధ్య జరిగిన సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం పూర్తిగా సహకరించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ముంబ యి పర్యటనలో భాగంగా ముందుగా మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగ ర్రావును ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్భవన్లో కలిశారు. ప్రాజెక్టు ప్రారంభోత్స వానికి రావాల్సిందిగా ఆయనను కోరారు. ఈ సందర్భంగా రాజ్భవన్ వద్ద విద్యాసాగర్రావు కేసీఆర్కు స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోశ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులు ఉన్నారు.