Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాప్టెన్లో ముగ్గురు మనోళ్లే
- 4,5,8 ర్యాంకులు మనవే
- ముంబయికి చెందిన కార్తికేయ టాపర్
- హైదరాబాద్ వాసి ఆకాష్రెడ్డికి 4వ ర్యాంకు
- బట్టిపాటి కార్తికేయ, తివేష్లకు 5,8 ర్యాంకులు
- ఐఐటీ ప్రవేశాలకు 38,705 మంది అర్హత
- ఫలితాలు ప్రకటించిన ఐఐటీ రూర్కీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్టెన్లో మూడు ర్యాంకులను తెలుగు విద్యార్థులే సాధించారు. టాప్ 20లో ఐదు ర్యాంకులు పొందడం గమనార్హం. హైదరాబాద్కు చెందిన జిల్లెల ఆకాష్రెడ్డి జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో నాలుగో ర్యాంకు సాధించారు. ఓపెన్ కేటగిరీలో బట్టిపాటి కార్తికేయ ఐదో ర్యాంకు, తివేష్ చంద్ర ఎనిమిదో ర్యాంకు, అమిత్ రాజారామన్ 12వ ర్యాంకు, జివికె సూర్యలిఖిత్ 13వ ర్యాంకు పొందారు. హైదరాబాద్కు చెందిన సూరపనేని సాయివిజ్ఞకు 44వ ర్యాంకు సాధించారు. ఆర్థిక వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్)కేటగిరీలో డి చంద్రశేఖర్ ప్రథమ ర్యాంకు పొందారు. ఓపెన్ కేటగిరీతోపాటు వివిధ కేటగిరీల్లో తెలుగు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ముంబయికి చెందిన గుప్త కార్తికేయ చంద్రేష్ 372కు 346 మార్కులతో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు పొందారు. అలహాబాద్కు చెందిన హిమాన్షు గౌరవ్ సింగ్ రెండో ర్యాంకు సాధించారు. న్యూఢిల్లీకి చెందిన ఆర్చిత్ బుబ్నా మూడో ర్యాంకు పొందారు. మహిళల కేటగిరీలో ఐఐటీ ముంబయి జోన్కు చెందిన షబ్నం సహారు 372కు 308 మార్కులతో ప్రథమ ర్యాంకులో నిలిచారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఐఐటీ రూర్కీ శుక్రవారం ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్డ్ ఆన్లైన్ రాతపరీక్షకు 1,61,319 మంది హాజరయ్యారు. వారిలో ఐఐటీల్లో ప్రవేశాలకు 38,705 మంది అర్హత సాధించారు. ఇందులో అబ్బాయిలు 33,349 మంది, అమ్మాయిలు 5,356 మంది ఉన్నారు. అర్హత పొందిన వారిలో జనరల్ కేటగిరీకి చెందిన వారు 15,566 మంది, ఈడబ్ల్యూఎస్కు చెందిన వారు 3,636 మంది, ఓబీసీ చెందిన వారు 7,651 మంది, ఎస్సీలు 8,758 మంది, ఎస్టీలు 3,094 మంది చొప్పున ఉన్నారు. తెలంగాణ నుంచి 16,886 మంది, ఏపీ నుంచి 13,267 మంది చొప్పున 30,153 మంది జేఈఈ అడ్వాన్స్డ్ రాతపరీక్షలకు హాజరయ్యారు. ఐఐటీల్లో ప్రవేశాలకు సుమారు 11 వేల మంది తెలుగు విద్యార్థులు అర్హత సాధించినట్టు నిపుణులు చెప్తున్నారు.
23 ఐఐటీల్లో 11,279 సీట్లు
దేశంలో 22 ఐఐటీలు, ధన్బాద్లోని ఐఎస్ఎంలో కలిపి 2018-19 విద్యాసంవత్సరంలో 11,279 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరంలో ఎన్ని సీట్లుంటాయో ఇంకా జాయింట్ సీటు అలకేషన్ బోర్డు కసరత్తు చేస్తున్నది. సీట్ల వివరాలు త్వరలోనే ప్రకటించనుంది. జేఈఈ అడ్వాన్స్డ్లో అర్హత పొందితేనే ఐఐటీల్లో ప్రవేశం లభిస్తుంది. ఇక జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన విద్యార్థులు ఎన్ఐటీలు, త్రిపుల్ఐటీలు, జీఎఫ్టీఐల్లో ప్రవేశం పొందొచ్చు. దేశంలో 31 ఎన్ఐటీల్లో 17,967 సీట్లు, 23 త్రిపుల్ఐటీల్లో 4,023 సీట్లు, 23 జీఎఫ్టీఐల్లో 4,683 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆర్కిటెక్చర్ ఆప్టి ట్యూట్ టెస్ట్ (ఏఏటీ) రాతపరీక్షకు హాజర య్యే అభ్యర్థులు ఈనెల 14,15 తేదీల్లో జేఈఈ అడ్వాన్స్డ్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఐఐటీ రూర్కీ ప్రకటించింది. ఏఏటీ రాతపరీక్ష ముంబయి, ఢిల్లీ, గువహటి, ఖరగ్పూర్, హైదరాబాద్, రూర్కీ ఐఐటీల్లో జరుగుతుంది.
వివిధ కేటగిరీల వారీగా టాపర్లు
కేటగిరీ ర్యాంకు అభ్యర్థి పేరు పట్టణం
జనరల్ 1 గుప్త కార్తికేయ ముంబయి
జనరల్ 2 హిమాన్షుగౌరవ్సింగ్ అలహాబాద్
జనరల్ 3 ఆర్చిత్ బుబ్నా న్యూఢిల్లీ
ఈడబ్ల్యూఎస్ 1 డి చంద్రశేఖర మాదాపూర్
జనరల్ 1 (అమ్మాయి) షబ్నం సహారు ముంబయి
ఓబీసీ 1 హిమాన్షుగౌరవ్సింగ్ అలహాబాద్
ఎస్సీ 1 సాంబిత్ బెహెరా భువనేశ్వర్
ఎస్టీ 1 పియూష్రాజ్ జైపూర్
వికలాంగులు(జనరల్)1 సుమిత్జైన్ సాత్నాఔ
వికలాంగులు ఈడబ్ల్యూఎస్ 1 దాసరి రాజేష్ గాంధీనగర్
వికలాంగులు(ఓబీసీ) 1 వేదాంత్దీపక్ నాగ్పూర్
వికలాంగులు(ఎస్సీ) 1 ఆర్యన్కుమార్ కాన్పూర్
వికలాంగులు (ఎస్టీ) 1 ధనంజరు సపవత్ కోటా
టాప్టెన్ ర్యాంకర్లు
ర్యాంకు అభ్యర్థిపేరు జోన్
1 గుప్త కార్తికేయ చంద్రేష్ ముంబయి
2 హిమాన్షు గౌరవ్సింగ్ ఢిల్లీ
3 ఆర్చిత్ బుబ్నా ఢిల్లీ
4 జిల్లెల ఆకాష్రెడ్డి హైదరాబాద్
5 బట్టిపాటి కార్తికేయ హైదరాబాద్
6 నిషాంత్ అభంగి ఢిల్లీ
7 కౌస్తుభ్ డిగే ముంబయి
8 తివేష్ చంద్ర ఎం హైదరాబాద్
9 ధ్రువ్ కుమార్ గుప్త ఢిల్లీ
10 షబ్నం సహారు ముంబయి
అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు
దరఖాస్తుచేసిన అభ్యర్థులు - 1,74,432
రాతపరీక్షకు హాజరైన వారు - 1,61,319
అర్హత సాధించిన వారు - 38,705
అర్హత సాధించిన అబ్బాయిలు - 33,349
అర్హత సాధించిన అమ్మాయిలు - 5,356
జనరల్ అభ్యర్థులు - 15,566
ఈడబ్ల్యూఎస్ - 3,636
ఓబీసీ అభ్యర్థులు - 7,651
ఎస్సీ అభ్యర్థులు - 8,758
ఎస్టీ అభ్యర్థులు - 3,094
జోన్ల వారీగా అర్హత సాధించిన విద్యార్థులు
జోన్ టాపర్ ర్యాంకు అర్హత పొందిన విద్యార్థులు
టాప్ 10 టాప్ 100 టాప్ 500 అర్హత
ఐఐటీ ముంబయి గుప్త కార్తికేయ 1 3 14 95 6,140
ఐఐటీ ఢిల్లీ గౌరవ్సింగ్ 2 4 29 167 9,477
ఐఐటీ గువహటి ప్రదీప్త పరాగ్ 28 0 2 4 1,822
ఐఐటీ కాన్పూర్ ధ్రువ్ అరోరా 24 0 7 20 4,515
ఐఐటీ ఖరగ్పూర్ గుడిపాటి అనికేత్ 29 0 10 28 4,525
ఐఐటీ హైదరాబాద్ జిల్లెల ఆకాష్రెడ్డి 4 3 30 132 8,287
ఐఐటీ రూర్కీ జయేష్ సింగ్లా 17 0 8 54 3,939
మొత్తం 10 100 500 38,705