Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పర్యావరణ కాలుష్యనికి కారణమయ్యే పరిశ్రమల నుంచి పరిహారాన్ని వసూలు చేసే అధికారాన్ని కాలుష్య నియంత్రణ మండలికి ఇస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఓ జీవో జరీ చేసింది. దీని ప్రకారం కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలపై కాలుష్య నియంత్రణ మండలి జరిమానా విధిస్తుంది. అలాగే వసూలు చేస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యానికి కారణమయ్యే సంస్థలన్నీ బాధ్యత కలిగి ఉండాలనీ, సంబంధిత పరిశ్రమలన్నీ కాలుష్య నియంత్రనకు తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలనీ ట్రిబ్యునల్ ఆదేశించింది.