Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని రావొద్దని కాంగ్రెస్ నేతలు అనడం వారి కుటిల నీతికి నిదర్శనమని టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. జగన్ను రావొద్దంటున్న కాంగ్రెస్ నేతలు మోడీ ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్ హాజర వ్వడాన్ని కూడా తప్పుపడుతున్నారా ? అని ఆయన ప్రశ్నించారు. గతంలో నూ మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రారంభానికి మోడీని రావొద్దని ఉత్తమ్ లేఖ రాశారని గుర్తు చేశారు. దేశంలోనే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును స్వాగతించాల్సింది పోయి.. కాంగ్రెస్ నేతలు తమ దుర్బుద్ధిని ప్రదర్శిసు ్తన్నారని ఆరోపించారు.కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలు ఆ నీటి ని వాడుకోవద్దంటూ తమ కార్యకర్తలకు పిలుపునిస్తారా? అని వ్యాఖ్యానిం చారు.నిర్వాసితులకు చక్కని ప్యాకేజీ ఇచ్చినప్పటికీ, ప్రతిపక్షాలు కోర్టుకెళ్లాయన్నారు. శ్రీశైలం నిర్వాసితులకు కాంగ్రెస్ హయాంలో న్యాయం జరగక ఇప్పటికీ తిరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.