Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కండ్లలో కారం కొట్టి, గొంతునులిమి ఘాతుకం
నవతెలంగాణ - అమీన్పూర్
మహిళను దారుణంగా కొట్టి చంపిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం వాణినగర్లో శనివారం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వాణినగర్లో సురేందర్గౌడ్, అరుంధతి(57) నివాస ముంటున్నారు. అరుంధతి ఇంట్లో ఒంటరిగా ఉండడం చూసి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి కండ్లలో కారం చల్లి, కర్రతో కొట్టి, గొంతు నులిమి చంపేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, ఇంట్లోని వస్తువులను అపహరించారు. కొద్దిసేపటికి చుట్టు పక్కల వారు గమనించి భర్త సురేందర్గౌడ్కు సమాచారమివ్వడంతో ఆయన వచ్చే సరికి భార్య చనిపోయి ఉంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలిసిన వారు చేసిన హత్యనా...? లేకపోతే దోపిడీ దొంగలు చేశారా...? అనే కోణంలో సీఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టారు.