Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూ మంజీర డైమండ్ టవర్స్లో ఘటన
నవతెలంగాణ-చందానగర్
ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి బాలుడు మృతిచెందిన ఘటన చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మతుడి తండ్రి వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని శంకర్పల్లికి చెందిన డాక్టర్ సంపత్ కుమార్ కుమారుడు ఆదిత్య కిరణ్ హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ న్యూ మంజీర డైమండ్ టవర్స్లోని హెచ్ బ్లాక్లో నివాసముంటున్నాడు. ఈ నెల 4న ఉదయం ఆదిత్య కిరణ్ కుమారుడు వశిష్ట(5) సైకిల్ తొక్కడానికి ఇంట్లోంచి బయటికెళ్లాడు. పక్కనే ఉన్న స్విమ్మింగ్ ఫూల్ గేటుకు ఆ రోజు తాళం వేయకపోవడంతో అటుగా వెళ్లి ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడిపోయాడు. గమనించిన ఓ వ్యక్తి వెంటనే బాలుడిని బయటకు తీసి స్థానిక సిటిజన్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి వశిష్ట ఈ నెల 6న మృతి చెందాడు. ఈ సంఘటనపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసినా వివరాలను వెల్లడించలేదు. కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతోనే మా కుమారుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.