Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్కు రేవంత్రెడ్డి వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పాత భవనాలు కూల్చి కొత్త సచివాలయం కట్టాలనే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. సచివాలయం భవనాలను కూల్చొద్దని కోరారు. ఈమేరకు శనివారం సచివాలయంలో సీఎస్కు ఆయన వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుత సచివాలయంలో కొన్ని భవనాలు కట్టి 15 ఏండ్లు కూడా కాలేదని, ఈ సచివాలయంలో పనిచేసిన ముఖ్యమంత్రులు ప్రధాని, రాష్ట్రపతి అయ్యారని గుర్తుచేశారు. వాస్తు పిచ్చితో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తామంటే.. కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేరని వాస్తు పండితులు చెప్పారని, అందుకోసం భవనాలు కూల్చడం సరైందికాదన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ఆలోచనను కాంగ్రెస్ అడ్డుకుంటుందని చెప్పారు. ఒకవేళ ముందుకెళ్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు.