Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- యంత్రాంగం
తీవ్రమైన ఎండ, వడగాలులకు తట్టుకోలేక వడదెబ్బతో ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటనలు జయశంకర్, కుమురం భీం జిల్లాల్లో శని వారం జరిగాయి. జయశంకర్ జిల్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన దేశిని సాంబలక్ష్మి( 60), పాలంపేట గ్రామానికి చెందిన ఆడేపు రాజమ్మ (65) ఇరువురు ఎండ వేడిమి తట్టుకోలేక వడదెబ్బతో మృతిచెందారు. కుమురం భీం జిల్లా పెంచికల్పేట మండలం ఎల్లూరు గ్రామానికి చెంది న పాగిడె జగదీశ్(36) రెండ్రోజుల క్రితం ఎండ తీవ్రతకు తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ గమనించి సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి మృతిచెందాడు.