Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాష్ట్రప్రభుత్వ పథకం 'రైతుబీమా' గల్ఫ్రైతన్నలందిరికీ ఆశించిన విధంగా అందడం లేదు. గల్ఫ్దేశాలలో కార్మికులుగా పనిచేసే రాష్ట్ర రైతులలో కేవలం పదిశాతం మందికి మాత్రమే ఈ బీమా ప్రయోజనాలు అందే అవకాశం ఉన్నది. రాష్ట్రం నుంచి దాదాపు లక్ష మంది వరకు రైతన్నలు గల్ఫ్దేశాలలో ఉన్నారు.
గల్ఫ్ దేశాలలో పనిచేసే రైతన్నలు అక్కడి నుంచి రాష్ట్రానికి రాలేక 'రైతుబీమా' పథకానికి దూరమవుతున్నారు. ఈ పథకం సాధారణంగా 18-59 ఏండ్ల మధ్య ఉన్న రైతుల కోసం ఉద్దేశించింది. ఒక వేళ రైతు మరణిస్తే ఆయన/ ఆమె కు చెందిన నామినీకి బీమా కింద ఐదులక్షల రూపాయలు అందుతాయి. ఈ పథకం కింద పేరు నమోదు చేసుకోవాలంటే ఒక 'ప్రపోజల్ ఫాం' మీద రైతు సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ, గల్ఫ్ దేశాలలో ఉన్న రైతులకు మాత్రం ప్రపోజల్ ఫాం మీద సంతంకం చేయడం కష్టంగా మారింది. కారణం.. సెలవులు దొరకక గల్ఫ్దేశాల నుంచి తిరిగి రాలేకపోవడంతో ప్రపోజల్ ఫాం మీద వారు సంతక చేయలేకపోతున్నారు. ఫలితంగా పథకం ప్రయోజనాలను వారు పొందలేకపోతున్నారు.
'ఒక లక్ష మంది ఎన్ఆర్ఐ రైతులలో 10వేల మంది మంది మాత్రమే గల్ఫ్ దేశాల నుంచి వచ్చి ప్రపోజల్ ఫాం మీద సంతకం చేసే అవకాశం ఉన్నది. ఇక మిగతావారు రాలేకపోవడంతో వారు బీమాకు అనర్హులవుతారు. అక్కడ వీరికి సెలవులు దొరకడమే గగనం' అని వలసదారుల హక్కుల కార్యకర్త భీం రెడ్డి మందా తెలిపారు. దీంతో విదేశాలలో పనిచేసే రైతన్నలలో 10శాతం మంది మాత్రమే ఈ పథకం కింద బీమాను పొందగలుగుతారని అన్నారు. కాబట్టి ఈ పథకం కింద రైతుల పేరు నమోదు కోసం ప్రస్తుతమున్న పద్దతికి స్వస్తి పలికి వీలైనంత ఎక్కువ మంది రైతులు లబ్ది పొందేలా ప్రభుత్వం మార్పు తీసుకురావాలని ఆయన చెప్పారు. ఇందుకోసం ఎల్ఐసీ ఉపయోగించే 'మెయిల్ ఆర్డర్ బిజినెస్' పద్దతితో ఎన్ఆర్ఐ రైతులను కూడా ఈ పథకం కిందకు తీసుకురావచ్చని సూచించారు.