Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఉపాధి ఆధారిత కోర్సులు ప్రారంభిస్తామని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ ఆర్ లింబాద్రి తెలిపారు. అందుకు అనుగుణంగా కొత్త సిలబస్ రూపొందిస్తామని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చాయిస్ బెస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) అమలుపై సమావేశం జరిగింది. కేయూ, ఎంజీయూ వీసీలు ఆర్ సాయన్న, అల్తాఫ్ హుస్సేన్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావుతోపాటు, వివిధ విశ్వవిద్యాలయాల బోర్డ్ స్టడీస్ చైర్మెన్లు, సబ్జెక్టు నిపుణులు హాజరయ్యారు. అనంతరం లింబాద్రి ఓ ప్రకటన విడుదల చేశారు. డిగ్రీలో మొత్తం 150 క్రెడిట్లు ఉంటాయని తెలిపారు. కోర్ పేపర్, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం పెంపొందించే కోర్సులుంటాయని పేర్కొన్నారు. వృత్తి నైపుణ్యం పెంచే కోర్సులు ప్రవేశపెడతామని తెలిపారు. కొత్త క్రెడిట్లు, గ్రేడింగ్ విధానం ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేస్తామని పేర్కొన్నారు.