Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిటైర్డ్ ఐఆర్టీఎస్ అధికారి ఏ.భరత్ భూషణ్
- కెవీపీఎస్ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-రాంనగర్
దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏండ్లు దాటిన దళితులకు రక్షణ కరువైందని రిటైర్డ్ ఐఆర్టీఎస్ అధికారి ఎ.భరత్ భూషణ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) తెలంగాణ 2వ రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భరత్ భూషణ్ మాట్లాడుతూ.. నేటికీ అనేక రాష్ట్రాల్లో దళితులపై దాడులు, గ్రామ బహిష్కరణలు జరుగుతున్నాయన్నారు. పట్టణీకరణ జరిగాక పట్టణాల్లో కొద్దిగా మార్పు వచ్చినప్పటికీ గ్రామాల్లో మాత్రం నేటికీ దళితులను ఆంటరాని వారిగానే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులాంతర వివాహాలు జరిగినప్పుడే కుల వివక్ష పోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కెవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు మాట్లాడుతూ.. జులై 1, 2 , 3వ తేదీల్లో రంగారెడ్డి జిల్లా రొక్కం భీంరెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగే కెవీపీఎస్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కెవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కాడిగళ్ల భాస్కర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు జి.రాములు, హిమబిందు, భూపతి వెంకటేశ్వర్లు, మహేందర్ పాల్గొన్నారు.