Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
- రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రాష్ట్రంలోని 250 మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ అన్నారు. వెంటనే వాటిని కరువు మండలాలుగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పాషా, నరహరి స్మారక కేంద్రంలో శనివారం జిల్లా రైతు సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పి.జంగారెడ్డి, సాగర్ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గతేడాది రాష్ట్రంలో 15లక్షల ఎకరాలు నకిలీ విత్తనాల కారణంగా రైతులు నష్టపోయారని వాపోయారు. అక్కడకక్కడ నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తూ ప్రభుత్వం కాలం గడుపుతోందన్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో 250 మండలాలు తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే కరువు మండలాలను గుర్తించి కేంద్ర సహాకారాన్ని తీసుకోవాలని సూచించారు. రెతాంగా సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.