Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో 70 వేల పోలీసు ఉద్యోగాలు: హోంమంత్రి
నవతెలంగాణ-వరంగల్
టెక్నాలజీతో నేరాల నియంత్రణ చేయొచ్చని హోంమంత్రి ఎండీ మహమూద్ అలీ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలు కాపాడటంతో పోలీసుల పనితీరు బాగుందన్నారు. శనివారం ఆయన వరంగల్ పోలీస్ కమిషనరేట్ను సందర్శించారు. ఈ సందర్భంగా వరంగల్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతలు, నేరా లను నియంత్రణకు చేపడుతున్న చర్యలతో పాటు అధికారులు, సిబ్బంది వివరా లను సీపీ వివరించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ.. దేశంలో తెలం గాణ ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు మంచి పేరు ఉందన్నారు. నేరాలను నియం త్రించడం, నేరస్తులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నా యన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల నిధులతో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయా లని అధికారులను ఆదేశించారు. ఖిల్లా వరంగల్ మండల పరిధి మామునూరులో నాలుగో బెటాలియన్లో కమాండెంట్ కంట్రోల్ సెంటర్ను మంత్రి ప్రారంభిం చారు. రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్కు సీఎం అధిక ప్రాధన్యనిస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు రూ.700కోట్లు మంజూరు చేశారన్నారు. త్వరలో 70వేల పోలీసు ఉద్యోగులను నియమించనున్నట్టు తెలిపారు.