Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబంధనలు పాటించని 11 వేల మంది లైసెన్స్లు రద్దు
- రోడ్డు భద్రతా కౌన్సిల్లో రవాణా శాఖ మంత్రి వేముల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సామాజిక మాధ్యమాల్లో రోడ్డు భద్రతపై ప్రజలందరికీ అవగాహన కల్పిస్తామని, తరుచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారి స్తామని రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. హైదరా బాద్లో శనివారం జరిగిన ఐదో రోడ్డు సేప్టీ కౌన్సిల్లో ఆయన మాట్లాడు తూ...రోడ్డు భద్రతపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు మేరకు ఆర్అండ్బీ ,జీహెచ్ఎంసీ, రవాణా, తదితర శాఖల సలహాలు,సూచనలు తీసుకు న్నామన్నారు. ఈ కౌన్సిల్కు సీఎం కన్వీనర్గా ఉన్నారన్నారు. జాతీయ రహదారులు రోడ్డు భద్రత విషయంలో ఏ, బీ, సీ కేటగిరీలను విభజిం చామన్నారు. రహదారులపై ప్రతి ఇరవై కిలోమీటర్లు దూరంలో అంబు లెన్స్, పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ప్రమాదం జరిగిన తర్వాత ఎంత సేపట్లో చేరుకున్నారు? ఎంత సేపట్లో ఆస్పత్రికి చేర్చారు? అనే విషయాలపై నివేదిక తయారు చేస్తామన్నారు. అద్దంకి- నార్కట్పల్లి రహదారిపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదాలపై లారీ ,ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తామన్నారు. వేగంగా వెళ్లే వారు, హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్లే వారు, సీట్ బెల్ట్ లేని వారికి చెందిన 11వేల లైసెన్స్లు రద్దు చేసి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. ఇకముందు కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై స్పీడ్గా వెళ్తున్నారని, చలాన్లు ఎక్కువగా వేసినా వేగాన్ని తగ్గించట్లేదని అన్నారు. హైదరాబాద్లో పాదచారులు రోడ్డు దాటేటప్పుడు ఎక్కువగా చనిపోతున్నారని, వారు రోడ్లు దాటేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ద్వి చక్ర, ఫోర్ వీలర్ వాహనాలు వెళ్లేందుకు ప్రత్యేక లైన్లు వేసేందుకు పైలట్ ప్రాజెక్ట్ చేపడతామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో రోడ్డు భద్రతపై చర్చించామన్నారు. ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, హౌం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, పంచాయతీరాజ్ గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్, లా అండ్ ఆర్డర్ అదనపు డిజి జితేందర్, ఆర్ అండ్ బి, జీహెచ్ఎంసి, రవాణా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.