Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని శ్రీరాంనగర్ కాలనీలో శనివారం విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో యువజంట ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఐ హరీశ్రెడ్డి వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లాకు చెందిన అర్చన, సంతోష్లు మూడు నెలల క్రితం పెండ్లి చేసుకున్నారు. ఉద్యోగాలు చేసేందుకు హైదరాబాద్కు వచ్చిన వీరు అనుమానాస్పద స్థితిలో ఇంట్లోనే ఇద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.