Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనంతగిరి అడవుల్లో దంపతుల కాల్చివేత
- నగలు, డబ్బు కోసం కారు డ్రైవర్ ఘాతుకం
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
వృద్ధ దంపతుల నుంచి డబ్బు, నగదు దోచుకునేందుకు పథకం పన్ని సొంత డ్రైవరే స్నేహితుడితో కలిసి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇద్దరు వృద్ధ దంపతులను దారుణంగా హతమార్చి అనంతరం కొండల్లోకి తీసుకెళ్లి మృతదేహాలను కాల్చేశాడు. వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీప్రాంతంలో ఆదివారం ఈ ఘటన ఆలస్యంగా వెలుగుజూసింది.
వికారాబాద్ రూరల్ సీఐ దాసు తెలిపిన వివరాల ప్రకారం... పటాన్చెరువు మండలం నందిగామకు చెందిన నవరతన్రెడ్డి(76), స్నేహలతరెడ్డి(72) కర్నాటకలోని బీదర్ జిల్లా హుమ్నాబాద్ మండలంలో 55 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసి, దాన్ని సాగు చేసుకుంటున్నారు. పని నిమిత్తం నందిగామకు వచ్చి శుక్రవారం తమ కారులో డ్రైవర్ సతీష్తో తిరుగు ప్రయాణమయ్యారు. డ్రైవర్ సతీష్ తన స్నేహితుడు రాహుల్కు విషయాన్ని తెలిపి, వారి నుంచి డబ్బు, నగలు దోచుకునేందుకు పథకం రచించాడు. అందులో భాగంగానే రాహుల్ వారి కారును అడ్డగించాడు. ఇద్దరు కలిసి వృద్ధులను హత్య చేశారు. అనంతరం శాలువతో చుట్టి అనంతగిరి కొండల్లోకి తీసుకెళ్లి మృతదేహాలకు నిప్పంటించారు. కారులో ఉన్న రూ. 30 వేల డబ్బు, నగలను తీసుకొని తమకేమీ తెలియనట్టు కారును మృతుల ఇంటివద్ద ఉంచారు. కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా వృద్ధుల ఫోన్ కలవకపోవడంతో ఈ నెల 14న వారు కర్నాటకకు వెళ్లి వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు డ్రైవర్ సతీష్ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడిని తీసుకొని పోలీసులు మృతదేహాలను కనుగొన్నారు. కర్నాటక హుమ్నాబాద్లో కేసు నమోదైనందున మతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నాటక పోలీసులకు అప్పగించినట్టు వికారాబాద్ ఇన్స్పెక్టర్ దాసు తెలిపారు.