Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఉదయం11.40కి హైదరాబాద్లో నూతనంగా కట్టిన ఎమ్మెల్యేల క్వార్టర్స్ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట నుంచి విజయవాడ బయల్దేరనున్నారు. మధ్యాహ్నం 1.45కి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 2.30కి తాడేపల్లిలో జగన్ను కలవనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి జగన్ను కేసీఆర్ ఆహ్వానించనున్నారు. సాయంత్రం ఓ ప్రయివేట్ కార్యక్రమానికి కేసీఆర్, జగన్ హాజరుకానున్నారు. అదే రోజు రాత్రి 8గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ చేరుకోనున్నారు.