Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలంలో మావోయిస్టుల కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. శనివారం రాత్రి చర్ల శబరి ఏరియా కమిటీ పేరుతో సీతానగరం, చిన్నబండిరేవు గ్రామాల మధ్య గల గుబ్బలమంగి బ్రిడ్జిపై కరపత్రాలు వెలిశాయి. ఆదివారం ఉదయం స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వాటిని తొలగించారు. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు పేరుతో వెలసిన ఆ పోస్టర్లో 'దళారులు, పెట్టుబడిదారులు దోపిడీ కోసమే ఆదివాసీలను అడవుల నుంచి గెంటేయాలని ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయి. దీనిని ప్రజాస్వామ్యవాదులు, అన్ని వర్గాల ప్రజలు ఖండించాలి. ఆదివాసీలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూముల హక్కుల కోసం మిలిటెంట్ తరహా ఉద్యమాలు నిర్వహించాలి. కేసీఆర్ ఆదివాసీలపై చేస్తున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి. దున్నేవానికే భూమి, అధికారం కోసం ఉద్యమించాలి' అంటూ లేఖలో పేర్కొన్నారు.