Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్య కార్యాచరణ చైర్మెన్ దాసు సురేశ్
- చేనేత కార్మికులను ఆదుకోవాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్న ట్టు ఢిల్లీ ఐక్య కార్యాచరణ బృందం చైర్మెన్ దాసు సురేశ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయపద్రం చేయాల్సిందిగా బీసీ సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశా రు. నేతన్నల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ య్య నేతృత్వంలో హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డిని కలి సి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వదేశీ వస్త్ర ప్రోత్సాహం నినాదంతో భారత జాతిని ఏకం చేసిన చేనేత రంగం ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వృత్తినే నమ్ముకున్న కార్మికులు మౌలిక వసతుల కొరత, పురాతన యంత్రాలు, ఆధునిక శిక్షణా లోపం, మార్కెట్ సదుపాయం లేకపోవడం లాంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అప్రతిహితంగా కొనసాగుతున్న నేతన్నల మరణాలను నిరోధించడానికి దేశ వ్యాప్తంగా చేపట్టనున్న ''నేతన్న''ల చలో ఢిల్లీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు.