Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక బస్సులో తరలించిన అటవీ అధికారులు
నవతెలంగాణ-కాగజ్నగర్
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం కొలాం గోంది గిరిజనులను ఆదివారం సాయంత్రంలోగా హైకోర్టు ఎదుట హాజ రుపర్చాలనే ఆదేశాల మేరకు అటవీ అధికారులు వారిని హైదరాబాద్కు తరలించారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రత్యేక టూరిస్ట్ బస్సులో గిరిజనులను రాజధానికి తీసుకెళ్లారు. మొత్తం 16 కుటుంబాలకు చెంది న 67 మంది గిరిజనులు వేంపల్లి టింబర్ డిపోలో ఆశ్రయం పొందు తున్న విషయం తెలిసిందే. అయితే ప్రతి కుటుంబానికి ఒక్కరు చొప్పున మొత్తం 16 మందిని కాగజ్నగర్ అటవీ డివిజన్ అధికారి ఎం. రాజరమ ణారెడ్డి, రేంజ్ అధికారి అనిత ఆధ్వర్యంలో హైదరాబాద్కు తీసుకెళ్లారు.