Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య
నవతెలంగాణ-నారాయణగూడ
జాతీయ స్థాయి ఓబీసీ మహాసభను ఆగస్టు 7న హైదరాబాద్ నగరంలోని సరూర్నగర్ గ్రౌండ్స్లో నిర్వహించనున్నట్టు జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య తెలిపారు. ఆదివారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో సభా బాధ్యతలను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్తో పాటు ఈశ్వరయ్యకు జాతీయ ఓబీసీ మహాసంఫ్ు అధ్యక్షులు సచిన్ రాజోల్కర్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు, ప్రొఫెసర్ సంజరు పన్నేసి, పోతన లక్ష్మీనారాయణలకు అప్పగించారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ.. బీసీ దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఒక్కో రాష్ట్రంలో నిర్వహించడం పరిపాటిగా వస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు జరపాలని, బీసీ జనగణన చేపట్టడమే ఈ మహాసభ ప్రధాన ఉద్దేశమని అన్నారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మహాసభకు తెలుగు రాష్ట్రాల సీఎంలతోపాటు మరో 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, మేధావులు, విద్యావేత్తలు హాజరవుతున్నట్టు తెలిపారు.