Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ (టీపీటీయూ) రాష్ట్ర నూతన అధ్యక్షులుగా మట్టపల్లి రాధాకృష్ణారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీపీటీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. టీపీటీయూ నూతన అధ్యక్షులుగా రాధాకృష్ణారావు, నూతన ప్రధాన కార్యదర్శిగా పట్లొల్ల చంద్రశేఖర్, అదనపు ప్రధాన కార్యదర్శిగా కె సారయ్యలను ఎన్నుకున్నామని టీపీటీయూ వ్యవస్థాపక అధ్యక్షులు జి వేణుగోపాలస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. టీఆర్టీ అభ్యర్థులకు వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. సీపీఎస్ను రద్దు చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 43 శాతం ఫిట్మెంట్ను ప్రకటించాలని పేర్కొన్నారు. 2016 వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన పథకం విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని కోరారు. అప్గ్రేడ్ అయిన పోస్టుల్లో పండితులు, పీఈటీలకు పదోన్న తులు ఇవ్వాలని తెలిపారు. ఉమ్మడి సర్వీసు నిబంధనల అమలుకు తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రూ.398 వేతనంపై పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు.