Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి ఎం.ధర్మానాయక్
నవతెలంగాణ-కూసుమంచి
తండాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టా డుతున్నాయనీ, ప్రభుత్వం స్పందించి వెంటనే పరిష్కరిం చాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ధర్మానాయక్, సహాయ కార్యదర్శి భూక్యా.వీరభద్రం నాయక్ డిమాండ్ చేశారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యతండా, కోక్య తండాలో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా లోక్య తండాలో వారు మాట్లాడుతూ.. ఇండ్లు లేని ప్రతి గిరిజన కుటుంబానికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గడిచిన ఐదేండ్ల కాలంలో గిరిజనులకు ఇండ్లు ఇవ్వలేదన్నారు. తండాల్లో పింఛన్లు కూడా సరిగ్గా అందటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించ కుంటే ఆందోళనలు, పోరాటాలు నిర్వహి స్తామని హెచ్చరించారు. వారి వెంట హెచ్.బాసు నాయక్, చంప్లా నాయక్, మంగ్లనాయక్, హరిలాల్, లక్ష్మీ ఉన్నారు.