Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశ చరిత్రలో చిర స్థాయిగా నిలిచేలా బీసీల మహాసభ నిర్వహిస్తామని, దీనికి బీసీ కుల సంఘాలంతా కలసిరావాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఓబీసీ నిర్వహణ కమిటీ చైర్మెన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం బీసీ భవన్లో కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశంలోని బీసీ సంఘాలు, సంస్థలను ఏకతాటిపై తీసుకువచ్చేందుకు తొలిసారిగా వచ్చే నెల 7న హైదరాబాద్లో బీసీల జాతీయ మహాసభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.