Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని విమర్శ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ అనేది అవినీతికి కేరాఫ్ అడ్రస్లా మారిందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ విమర్శించారు. ఆ పార్టీ నేతలు గాంధీ భవన్లో కూర్చుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం హైదరాబాద్లోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఇంజనీరులాగా వ్యవహరించి కాళేశ్వరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయించారని అన్నారు. అతి తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయటం ద్వారా తమ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని చెప్పారు. సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్కను నియమించటం ఆ పార్టీ నాయకులకే ఇష్టం లేదని విమర్శించారు. దాంతో వారికి కన్ను కుట్టిందని చెప్పారు.