Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
మద్యం మత్తులో భార్య మీద కిరోసిన్ పోసి నిప్పంటించాడు భర్త. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగింది. ఎస్ఐ డేనియల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మూడ ఉపేందర్ ఆటో డ్రైవర్. రోజూ తాగొచ్చి భార్య మణెమ్మ(28)ను కొట్టేవాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానం కూడా పెంచుకున్నాడు. ఆదివారం రాత్రి కూడా తాగొచ్చి భార్యతో గొడవపడ్డాడు. అనంతరం ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. చుట్టుపక్కల వారు గమనించి మంటలార్పి ఆమెను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మృతిచెందింది. మణెమ్మ తల్లి ధనమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.