Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
విద్యా హక్కు చట్టం-2009లో వస్తే ఇప్పటి వరకూ అమలు చేయ లేదని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు ఇచ్చింది. పిటిషనర్ ఆరోపణలకు వివరణ ఇవ్వాలని పాఠశాల విద్యా శాఖ అధికారులు ఇతరులను ఆదేశించింది. పదేండ్ల క్రితం చట్టం వచ్చినా నేటికీ 1994 నాటి చట్టాన్నే అధికారులు అమలు చేస్తున్నారంటూ సికింద్రాబాద్ వాస్తవ్యుడు విజయ గోపాల్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని సోమవారం హైకోర్టు విచారించింది. పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, అదే శాఖ కమిషనర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, రెండు జిల్లాల విద్యాధికారులు తమ వాదనలతో కౌంటర్ వేయా లని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయ మూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. పాఠశాలల ఆదాయం 50 శాతం జీతాలు, 15 శాతం ఇతరత్రా ఖర్చులకు వెచ్చించాలి. గుర్తింపు పొందిన బడుల వివరాలు ఏటా ఆయా పాఠశాలలు ఇవ్వాలి... వంటి రూల్స్ అమలుకు నోచుకోవడం లేదని పిటిషనర్ లాయర్ రచనారెడ్డి హైకోర్టు దష్టికి తెచ్చారు. మెజిస్టీరియల్ ఎంక్వయిరీ తర్వాత మహేంద్రహిల్స్లోని డీపీఎస్ పాఠశాలలో స్పోర్ట్స్ ఫీజు 54 శాతం తగ్గిందని, ఎంక్వయిరీకి ముందు ఆ ఫీజు రూ.1.2 లక్షలుగా ఉండేదన్నారు. విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది.
ఆ భూములపై విచారణకు జాప్యమెందుకు?
గుడిమల్కాపూర్లోని సర్వే నెంబర్ 284/6లోని 5262 గజాల స్థలం వ్యవహారంలో బోగస్ డాక్యుమెంట్ల ఆధారంగా నిరభ్యంతర పత్రాన్ని (ఎన్వోసీ) ఇచ్చిన ఉన్నతాధికారుల కమిటీపై శాఖాపరమైన విచారణ చేయ డానికి ఎందుకు జాప్యం చేస్తున్నారో తెలియజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. కమిటీ చైర్మన్గా నవీన్ మిట్టల్, సభ్యు లుగా జాయింట్ కలెక్టర్ వి.దుర్గాదాస్, రిటైర్డు స్పెషల్ తహసీల్దార్ వి.వి. వెంకట్రెడ్డి, సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ మధుసూదన్రెడ్డి గతంలో ఉన్నారు. ఈ కమిటీకి బోగస్ డాక్యుమెంట్లు సమర్పించి మహ్మద్ రుక్ముద్దీన్, మహ్మద్ అబ్దుల్ వదూద్, సయ్యద్ అబ్దుల్ రబ్లు ఎన్వోసీ తీసు కున్నారు. ఈ ముగ్గురిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, కమిటీలోని వారిపై డిపార్ట్మెంటల్ ఎంక్వరీ చేసి చర్యలు తీసుకోవాలని శాంతి అగ ర్వాల్ వేసిన కేసులో గతంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై దాఖలైన అప్పీల్ రిట్ను సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు శాఖాపరంగా ఎందుకు ఎంక్వయిరీ ప్రారంభించలేదో వచ్చే ఆగస్టు 5వ తేదీలో హైకోర్టుకు నివేదిక ఇవ్వాలని సీఎస్ను బెంచ్ ఆదేశించింది.
24న నిర్వాసితుల సమస్యలపై విచారణ
సిద్దిపేట జిల్లా ముగులు మండలం మామిడ్యాలలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులు దాఖలు చేసిన మూడు వ్యాజ్యాలను కలిపి ఈ నెల 24న విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది. ఆ తేదీ నాటికి నిర్వాసితులకు అందజేసే పరిహార చెల్లింపులు సిద్దం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పరిహారాన్ని చెక్కుల రూపంలో సిద్దం చేసి 24న హైకోర్టుకు అందజేయాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణపై హైకోర్టు స్టే ఆదేశాలున్నా అధికారులు సేకరణకు వీలుగా అవార్డు జారీ చేయడం చెల్లదని పేర్కొంటూ మామిడ్యాల గ్రామస్తుడు శ్రీనివాస్ సహా పాతిక మంది దాఖలు చేసిన వ్యాజ్యాన్ని బెంచ్ విచారించింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం, పునర్నిర్మాణ చర్యల కోసం తమ భూముల్ని సేకరించడం చెల్లదని పేర్కొంటూ దాఖలైన అత్యవసర రిట్ను కూడా ధర్మాసనం విచారించింది.