Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో 2017లో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాలను ప్రకటించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ సోమవారంనాడొక ప్రకటనలో తెలిపారు. పద్యకవితా ప్రక్రియలో మాల్యశ్రీ (చింతూరి మల్లయ్య) రచించిన పద్యకృతి 'మన్యభారతం', వచన కవితా ప్రక్రియలో నారాయణ స్వామి రచించిన 'వానొస్తద?', గేయకవితా ప్రక్రియలో తుమ్మూరి రామ్మోహన్రావు రచించిన 'ఎలకోయిల పాట' సాహితీ పురస్కారాలకు ఎంపిక అయ్యాయి. బాలసాహిత్యంలో కొల్లూరు స్వరాజ్యం వెంకట రమణమ్మ రచించిన 'అనగా అనగా పిల్లల కథలు', కథానికా ప్రక్రియలో బి మురళీధర్ రచించిన 'నెమలినార' కథా సంపుటి, నవలా ప్రక్రియలో భూతం ముత్యాలు రచించిన 'మొగలి' నవల, సాహిత్య విమర్శలో అట్లా వెంకటరామిరెడ్డి రచించిన 'శైలీ శిల్పం వెయ్యేళ్ల తెలుగు కవిత్వం' పురస్కారాలు పొందాయి. నాటకం, నాటికల్లో భారతుల రామకృష్ణ రచించిన 'సప్తసౌరభాలు'కు అనువాదంలో మెహక్ హైదరాబాదీ రచించిన 'గుప్పిట జారే ఇసుక'కు పురస్కారాలు దక్కాయి. ఇతర వచన రచనల విభాగంలో కోవెల సంతోష్కుమార్ రచించిన 'దేవరహస్యం', రచయిత్రి ఉత్తమ గ్రంధం విభాగంలో జూపాక సుభద్ర రచించిన 'రాయక్కమాన్యం' గ్రంథాలు సాహతీ పురస్కారం పొందాయి. జూన్ నెలాఖరున హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాలు ప్రదానం చేస్తామని వివరించారు. పురస్కారం కింద ఒక్కొక్కరికి రూ.20,116 నగదు అందచేసి, సత్కరిస్తామని తెలిపారు.