Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వట్టెం రిజర్వాయర్ (వెంకటాద్రి) ముంపు గ్రామాల ప్రజలకు మల్లన్నసాగర్ ముంపు బాధితుల తరహాలో పరిహారం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారంనాడు ఆయన సీఎంకు లేఖ రాసారు. వట్టెం రిజర్వాయర్ (వెంకటాద్రి) ముంపు గ్రామాలైన కారుకొండతాండ, అనేఖాన్పల్లితాండ, అనేఖాన్పల్లి, జీగుట్టతాండ, రాంరెడ్డిపల్లితాండా వాసులకు న్యాయం చేయాలని కోరారు. అక్కడి ప్రజలు ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నారని, వాటిని పరిగణనలోకి తీసుకొని మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ తరహా పరిహారం, ప్యాకేజీ చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పునరావాసప్యాకేజీ, డబుల్బెడ్రూం ఇండ్లు, 25 లక్షల విలువైన 250 గజాల ఇంటిస్థలం, ముంపుతాండల్లోని ఇంటి స్థలానికి గజం రూ.1,600 చొప్పున నష్టపరిహారం, వన్టైం సెటిల్మెంట్గా చెల్లించాలని కోరారు. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి మూడెకరాల భూమి, నిర్వాసితుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.