Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోంమంత్రి మహమూద్ అలీ
- 2023 నాటికి కళాశాలలుగా మారుస్తామని వెల్లడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశా లలను ఏర్పాటు చేసినట్టు హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. బడు గు, బలహీనవర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 119 బీసీ గురుకుల పాఠశాలల ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం నగర శివారులోని మన్సూరాబాద్లో ఏర్పాటు చేసిన గోషమాహల్, జూబ్లిహిల్స్, ముషీరాబాద్ పాఠశాలలను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందన్నారు. గురుకుల విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా విద్యా బోధన చేస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు, విద్యార్థులందరికీ పౌష్టికాహారం అందజేస్తున్నామన్నారు.
కళాశాలలుగా మార్పు : మంత్రి కొప్పుల
రాష్ట్రంలోని అన్ని బీసీ గురుకుల పాఠశాలలను 2023 నాటికి కళాశాలలుగా మార్పు చేస్తామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. బీసీ గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నందున వాటిల్లో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారని, పోటీని తట్టుకునేందుకే కొత్త గురుకులాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో పాఠశాలను ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన 119 బీసీ గురుకుల పాఠశాలల్లో బాలురకు 63, బాలికలకు 56 పాఠశాలలు కేటాయించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకులాలు 281కి పెరిగాయని, ఈ విద్యా సంవత్సరం బీసీ గురుకులాల్లో 92,340 మంది విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించామని తెలిపారు. త్వరలోనే అన్ని గురుకులాలకు సొంత భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని, అలాగే పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుల నియామకాన్ని కూడా పూర్తి చేస్తామన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలు భావిపౌరులకు బంగారు బాటలు వేస్తున్నాయని అన్నారు. పేదింటి బిడ్డలను ఉన్నత విద్యావంతులుగా తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రం ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో 19 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండగా, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవి 281 చేరుకోవడం హర్షణీయమన్నారు.